మదనపల్లి, జూలై 27 (కలం మనస్సాక్షి ప్రతినిధి) :
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం.బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. సబ్ డివిజన్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజల సమస్యలకు వెంటనే స్పందించాలని, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.



