ప్రొద్దుటూరు: స్థానిక గోల్డెన్ పార్కులో బీజేపీ ఇంచార్జి కోనేటి కృష్ణప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎల్ఏ-2లకు సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఫారాలు-6, 7 వినియోగం, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఓటర్లకు అవగాహన కల్పించే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్, జిల్లా ఇంచార్జి కే. చిట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరై బీఎల్ఏ-2ల బాధ్యతలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



