తిరుపతి జిల్లా మార్చి 15 మనస్సాక్షి:
ఓబులువారిపల్లి మండలం, ముక్కా వారిపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రైతున్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ బాధ్యులు కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తనయుడు టిడిపి యువనాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాల గూర్చి కరపత్రాలు అందజేసి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 4