ప్రజా సమస్యలకే మొదటి ప్రాధాన్యత

విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్య పట్ల మంత్రి స్పందించి తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి కృషి చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp