పీలేరు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని, రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహానీయుడని కొనియాడారు.
Post Views: 2