అన్ని దానాల్లో అన్న దానం మిన్న అధ్యక్షులు శ్యామ్

రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో ఊటుకూరి కిరణ్ కుమార్ కుమార్తె మనస్వి మొదటి పుట్టినరోజు సందర్భంగా భవిత కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షుడు లయన్ పి.శ్యామ్ తెలిపారు. అనంతరం దాత మాట్లాడుతూ నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నా వంతుగా ప్రజలకు ఉపయోగపడే సేవ చేయాలనే ఉద్దేశంతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అలాగే రాబోయే రోజులలో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్, మాజీ అధ్యక్షుడు లయన్ పి.శివారెడ్డి, కోశాధికారి లయన్ కె.మనోహర్ రాజు, లయన్ షంషీర్ వలి, భవిత కేంద్రం సిబ్బంది జనార్ధన్, త్రిలోక్, తదితరులు పాల్గొన్నారు

Facebook
X
LinkedIn
WhatsApp